శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర


శ్రీ బ్రహ్మముగారి వేదాంతంలో కులమత తత్వాలు

నేటికి సుమారు నాలుగు వందల సంవత్సరముల పైబడిన కాలంలో మన ఆంధ్రదేశంలో ఆవిర్భవించినాడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు. ఆయన ఆది విశ్వబ్రాహ్మణ వంశంలో శైవ సాంప్రదాయ నిష్టాపరుడై జన్మించినను శ్రీ మదద్వైత సిద్ధాంతాన్ని విశిష్య ప్రచారం చేయుచూ బ్రహ్మతత్వాన్ని నిర్దుష్టంగా ఆశ్రయించి, అందుగల సమగ్రతను గమనించి తత్ ప్రాధాన్యతను తాను అభవించుచు, వేవేల జనంబులకు కూడ ఉపదేశంబులు నిచ్చుచు తన యావజ్జీవితమును బ్రహ్మ కైంకర్య మొనరించి, సజీవ సమాధి నొంది యావదాంధ్ర దేశమునకేగాక భూమండలమంతటిలో తన పేరు ప్రతిష్ఠలు ఆచంద్రార్క స్థాయిలో నుండునటుల కీర్తిని గడించినాడు.

తాను రచించిన కాలజ్ఞాన గ్రంథంలో తాను అవతారమూర్తిననుచూ తన సర్వజ్ఞత్వాన్ని విపులంగా ప్రకటించినాడు. ప్రాచీన భారతీయ నాగరికతా కాలములో సంస్కృతము ప్రధాన భాష, దేశీయ భాషలలో అగ్రతను పొందినది. తెలుగుభాష యావత్ భారతంలో వేదములకు, శాస్త్రములకు, రామాయణ భారతాది గ్రంథములకు బహుజన ప్రాశస్త్యము కలదు. హిందూమతము ఈ గ్రంథముల సారమనియే చెప్పవచ్చును. పూర్వజన్మ కర్మఫలితములను జీవుడనుభవించు చుండును. సద సత్కర్మల ఫలమూలముగనే పునర్జన్మము చేకూరుననెడిది హిందూమత నమ్మకము. చాతుర్వర్ణముల విభాగము ఆచరణీయమై యుండెడిది. ఆ సమయమున విదేశీ దండయాత్రలు కారణముగను తురుష్కులు అన్యోన్యము రాజ్యకాంక్షలకు లోనై దేశమునగల ఆలయ శిల్పాధీకములను చిన్నాభిన్నం చేయడం ప్రారంభించారు. దీని మూలకంగా హిందూ మతస్థులు కూడా కొందకు ఇస్లాం మతాన్ని చేపట్టినారు. కొందరు క్రిష్టియన్ మతంలో ప్రవేశించినారు. ఈ పరిస్థితులలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించి అద్వైత మతాన్ని మూలకు నెట్టవలెనని యత్నించినవి గాని, దీని ప్రాబల్యం సుదృఢంగా వుంది, అన్నిమతాలను ఆదరణతో చూస్తూ యే మతమునందు ద్వేష భావము లేకుండుటయే ఇది అడుగంటకుండుటకు ముఖ్య కారణము. ఇతర మతములలో ఇంతటి సహనశక్తి లేదనుట నిర్వివాదాంశం.

కాలం ఒకే విధముగా ఉండదని కాలజ్ఞానము తెలిసిన వారందరకు తెలుసు సాధారణ ప్రజలు ఒకేరకంగా నడుస్తుందని భావించటం కూడ కద్దు. వ్యావహారికులు ఏ కాలానికాగొడుగు బట్టి తమ కార్యార్థాలు సిద్ధింప జేసికొని తృప్తి పడతారు. కాని ప్రాజ్ఞులైన జ్ఞానులు తమను మరచి లోకాన్ని ఉద్ధరించే విషయంలో కంకణం కట్టుకొని నడుం బిగిస్తారు. కోవకు చెందినవాడే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మముగారు.

దేశంలో నలుమూలలా దౌష్ట్యం ఎక్కువైంది. ఆచారాలు, వ్యవస్థలు పెచ్చుపెరిగి దుర్మార్గానికి దోహదాలవుతున్నాయి. వైదిక, దైవిక సాంప్రదాయాలను అణగదొక్కుతూ బౌద్ధమతం పెల్లుబికిన ప్రవాహంలాగా బయలుదేరి కట్టలుతెగిన నదీ ప్రవాహంలాగా లోకాన్ని భ్రష్టం చేస్తున్న ఈ మతంలో కూడ రెండు చీలికలు యేర్పడినవి. హీనయాన, మహాయాన అని. హీనయాన కృత్యములు ప్రజలకే యేవగింపయినందున కొలదికాలములోనే దాని ప్రభావము క్షీణించినది. మహాయాన సాంప్రదాయంలో విగ్రహారాధనకు ప్రాధాన్యత పూర్తిగా యున్నందున శిల్పకళా వైశిష్ట్యం ఆ రోజులలో పుంజుకొన్నట్లు మరెన్నడును వృద్ధి కాలేదు. నాటి రాజశేఖరులందరు మహాయాన మార్గస్థులై ప్రజలను ప్రోత్సహించి ఆలయ పోషణము శిల్పచాతుర్య వై లక్షణంగల కళాప్రపూర్ణులను విశేషంగా ఆదుకొని పోషించి కళాఖండాలను సుస్థిరం చేసినారు.

ప్రతిభా భాషితుడైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు జాతీయమైన శిల్పకళా వైశిష్ట్యాన్ని దేశదేశాలు తిరిగి ఎచ్చటెచ్చట యేయే వైభవాలున్నవో చూచి ఆనందించటమేకాక, ఆయా స్థానములలో యుండదగిన కొన్ని పవిత్రమైన విశేషాంశములను తెలియపరచుచూ శిష్యులకు బోధలు జరుపుతూ తాను వాటిరూపు రేఖలనూ దిద్ది చూపుచూ దేశప్రచారాన్ని సాగించాడు.

  • మాతా ముత్తెమ్మ సమేత శ్రీ కక్కయ్య స్వామివారు eshwari devi mattam
    kalagnani qr code